నాది 1953 ఆగస్ట్21 జననం.
ఇక్ష్వాకుల కాలం అనిలెక్కలు వేసు కొంటున్నారా? అవును …అదే కాలం.!!
మీలో చాలామంది పుట్టిఉండరు. ఆ రోజుల్లో నర్సరీలు యూకేజీ లు లేవు.
మూడవ సంవత్సరమే ఒకటో క్లాస్ లో ప్రవేశం.నాకైతే 1,2,3,4క్లాసుల కబుర్లు గుర్తు లేవు. అంటే ముదుసలి అయిపోయాగా..grey cells తగ్గిపోయాయి.
5,6తరగతులు కావలి లో చదివా. నాన్నగారు కావలి రైల్వే స్టేషన్ లో బుకింగ్ క్లర్క్.రోజూస్కూల్ కు వెళ్లి రావడం గుర్తుంది.చెప్పులు లేని రోజులు.ఓ రోజు ఇంటికి వస్తుంటే ఎవరి రేడియో లోనో ఒక పాట కొంచెం విన్నా.రోజూ అదే టైం కు వస్తుందని నమ్మిన సత్తెకాలపు జీవిని.
6 నెలల పరీక్షల సెలవల్లో పొద్దున్నే ఇంట్లో తరవాణి అన్నం తిని జిల్లా గ్రంధాలయ సంస్థ వాళ్ళ లైబ్రరీ కు వెళ్లి ఇంటికి భోజనానికి వచ్చి మరల నాలుగు గంటలకు వెళ్లి చీకటి పడే వేళకు వచ్చేవాడిని. అందరూ నన్ను వింతగా చూసేవారు.ఈ బుడతడు రోజు వస్తున్నాడని.కనబడ్డ పుస్తకాలు తిరగేసేవాడిని.
అలా ఉన్న రోజుల్లో హైస్కూల్ కు ఎంట్రన్స్ పరీక్ష పెట్టారు.పలక పై రాయాలి(ఎలా అని అనుకొంటున్నారా? those were the days).ఎంట్రన్స్ పరీక్ష లో” నేను గారు” ( ఈ పదం పై పూణే పెద్దాయన గుత్తాధిపత్యం లేదని గ్రహించ గలరు! ) టాప్ . కావలికి ఒకటే హైస్కూల్. నాకు 6 క్లాసు లో ఎంట్రీ.
ఒక రోజు గ్రౌండ్ లో football అడుకొంటున్నా అందరితో కలిసి. హైస్కూల్ గంట కొట్టే అతను వచ్చి హెడ్మాస్టర్ రమ్మంటున్నారు అని పిలుచుకొని పోయాడు. HM రూం లోకి ఎంట్రీ. అక్కడ మా నాన్నగారు కూర్చొని ఉన్నారు. HM మా నాన్న గారిని “ఒరేయ్.నే కొడుకు ఫస్ట్ వచ్చాడు.ప్రభుత్వం వీడిని ఉచితం గా చదివిస్తుంది. హైబా పంపుతావా“అని అడిగారు.నాన్నగారు లేదు sir అని చాలా వినమ్రంగా చెప్పారు.
నేను ఆ రాత్రి నాన్నగారితో మా HM గారు మిమ్ములను ఒరేయ్ అని ఎందుకన్నారు? అని అడిగా.మా నాన్నగారు “ఆయన నాకు బాగా తెలిసిన మాస్టారు అని చెప్తూ ఎంత పెద్ధ వాడివి అయినా మాస్టార్లతో ఎప్పుడూ వినమ్రంగా మాట్లాడాలని చెప్పారు. ఏ విషయం నాలో బలంగా నాటుకు పోయింది.(ఒక సందర్భం లో 25 ఏళ్ళ తర్వాత బ్యాంకు మేనేజర్ గా ఉన్నప్పుడు నేను చాలా వినమ్రనంగా ప్రవర్తించిన తీరు నా సహా ఉద్యోగుల్ని ఆశ్చర్య పరిచింది, ఆ ముచ్చట మరో సారి !)
కొన్నాళ్ళకు మా నాన్నగారు ASM(Asst Stn Master) గా పదోన్నతి పొంది మచిలీపట్నం బదిలీ అయ్యారు.
== సశేషం
