జిహ్వల జైత్రయాత్ర
సృష్టి ఆరంభంలో నాలుకకు ఎముక ఉండేదిట. అబద్ధం ఆడకుండా సృష్టికర్త చేసిన ఏర్పాటది. సృష్టి వర్ధిల్లుతున్న కొద్దీ అందులో అనేకమైన కొత్త కొత్త ప్రాణులు వచ్చి చేరాయి. పాము, కప్ప ఆ కొత్తగా చేరినవాటిలోవి. అలా ప్రాణులు వేలల్లో పెరిగిన కొద్దీ వాటిని నియమంగా నడపడానికి నాయకత్వం అవసరమయ్యింది. సృష్టికర్త బుర్ర, బుద్ధి ఎక్కువగా ఉన్న మానవుడికి అప్పజెప్పాడు.

